మద్దతు ధరకు తక్కువకు అమ్మవద్దు.. నేరుగా ఖాతాల్లోకి సొమ్ము చెల్లిస్తాం! మంత్రి భరోసా!
Mon Apr 14, 2025 22:46 Politics
రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించని, రైతులకు నష్టం కలిగించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన కలెక్టర్ ఎస్. లక్ష్మీశ, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి నేడు పరిశీలించారు. అనంతరం రాయనపాడు, పైడూరుపాడు ప్రాంతాల్లో పర్యటించి, ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రి ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరుతో అధికంగా కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే తాను పర్యటిస్తున్నట్లు మంత్రి రైతులకు తెలిపారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ, "నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ-ట్యాగ్ చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా అయినా ధాన్యం సేకరిస్తాం" అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లకు చెల్లించాల్సిన రూ. 400 కోట్ల బకాయిలను కూడా తమ కూటమి ప్రభుత్వం చెల్లించిందని, మిల్లర్లకు అండగా నిలిచినప్పుడు వారు కూడా రైతులకు సహకరించాలని సూచించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఎంత ధాన్యం పండినా, లక్ష మెట్రిక్ టన్నులు అయినా, రెండు లక్షల మెట్రిక్ టన్నులు అయినా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళనకు గురై తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ఆర్బీకేల ద్వారా ప్రభుత్వానికి మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని, ట్రక్ షీట్ జనరేట్ అయిన 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన భరోసా కల్పించారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరదల కారణంగా దాళ్వా పంట ఆలస్యమైనందున, ఖరీఫ్లో నమోదైన ఈ-పంటను రబీకి మార్చేలా వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన విజ్ఞప్తి మేరకు తక్షణమే అధికారులను ఆదేశించి, ఆ వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!
మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!
ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!
మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..
రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #FarmerSupport #MSPGuarantee #APGovernment #NadendlaManohar #FarmersFirst
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.